Contact

Text

Tuesday 11 November 2014

నా భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారు

20:26 - By Unknown 0


ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకున్న భర్త
ఏలూరు (వన్‌టౌన్) : తన భార్యతో వ్యభిచారం చేయిస్తున్నారని, రక్షించాలని కోరుతూ ఓ భర్త ప్రజావాణిలో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు మండలం గవరపేట 50వ డివిజన్‌లో నివాసం ఉండే చొచ్చుపల్లి శ్రీనివాస్ భార్యను తంగెళ్లమూడి ఎమ్మార్సీ కాలనీకి చెందిన మణి అనే వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలు తీసుకువెళ్లిపోయిందని, దీంతో తన భార్యను పంపించాలని కోరితే ఖర్చులకు డబ్బులిస్తామంటున్నారని వాపోయాడు. బలవంతంగా తన భార్యను నిర్భందించి వ్యభిచారం చేయించడమే కాక భార్యను పంపాలని అడిగితే చంపుతానని, కొడతానని బెదిరిస్తున్నారని, దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చే శాడు.

తనకు ఆరోగ్యం బాగోలేదని, పిల్లలు రాఘవస్వామి (8), మల్లేశ్వరస్వామి (7) అనాథలుగా రోడ్లపై తిరుగుతున్నారని, మా కుటుంబాన్ని రక్షించాలంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ఏలూరులో యథేఛ్ఛగా జరుగుతున్న వ్యభిచారాన్ని అరికట్టాలని, తన భార్య లాంటి ఎంతో మంది వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్నారని బాధితుడు తెలి పాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ కె.భాస్కర్ కేసును దర్యాప్తు చేయాలని డీఎస్పీ కేజీవీ సరితను ఆదేశించారు. నగరంలో చాపకింద నీ రులా సాగుతున్న వ్యభిచార కేంద్రాలపై ఇప్ప టికైనా పోలీసు శాఖ దృష్టి సారించాల్సి ఉంది.
 

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...
© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top