అయితే మూడో పార్టీ బీజేపీ కూడా ఉందని కోడెల ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానిపై జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అయితే టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉందని, వారు ఇటువైపు వచ్చే వరకు పాలకపక్షంగానే పరిగణిస్తామని జగన్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి.
దీనిపై యనమల స్పందిస్తూ ఎప్పటికీ తాము పాలకపక్షంలోనే ఉంటామని అనబోయి.. ప్రతిపక్షంలోనే ఉంటామని అన్నారు. ఆ తర్వాత వెంటనే తన పొరపాటును సద్దుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ 1999 సంవత్సరంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు శాశ్వతంగా ప్రతిపక్షంలోనే ఉంటారని టీడీపీ నేతలు అన్నారని, అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అధికారం అన్నది దేవుడు ఇస్తారని, ప్రజలు నిర్ణయిస్తారని జగన్ వ్యాఖ్యానించారు.

About the Author

0 comments:
Post a Comment