జగన్ మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసు మళ్లీ వెంటాడుతోంది. ఈ కేసుపై విచారణను జూలై 21 నుంచి ప్రారంభించబోతున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించడంతో జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైకాపాలో నిరాశ అలముకున్నట్లు తెలుస్తోంది. కాగా సీబీఐ జగన్ మోహన్ రెడ్డిపై ఇప్పటికే 10 అభియోగ పత్రాలను దాఖలు చేసింది. వీటిలో అరబిందో, హెటిరో కేసులను జూలై 21 నుంచి ప్రారంభించబోతున్నట్లు స్పష్టీకరించింది.
ఈ కేసుల తర్వాత మెల్లమెల్లగా మిగిలిన కేసులపై విచారణ కూడా ఉంటుందనే సంకేతాలు వెలువరించింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి తెదేపా ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఒకవేళ కేసు విచారణ సమయంలో జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ జైలుకు తీసుకెళతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి
About the Author

1 comments:
vest news
Post a Comment