Contact

Text

Friday 28 March 2014

వంద మందిపైగా ఊచకోత

09:42 - By Unknown 0

కానో: నైజీరియాలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు.ఈశాన్య నైజీరియా బోర్నో రాష్ట్రంలో క్రై స్తవులు అధికంగా ఉండే ఇఘే గ్రామంపై దాడిచేసి దాదాపు వంద మందిని ఊచకోత కోశారు. శనివారం రాత్రి ఆరు ట్రక్కులు, ద్విచక్ర వాహనాలపై ఆయుధాలతో సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బార్నాబాస్ అనే రైతు వెల్లడించారు. ఈ ఘటనతో భీతిల్లిన చాలామంది గ్రామస్తులు ఇళ్లను వదలి పారిపోయారు.

ఆ దుండగులు బోకో హరామ్ ఇస్లామిస్ట్ బోకో హరామ్‌కు చెందినవారుగా అనుమానిస్తున్నట్లు స్థానిక సెనేటర్ అలీ డుమె ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు వెల్లడించారు. 60 మంది మతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని, మిగతావాటికి చేయాల్సి ఉందని చెప్పారు.

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top