Contact

Text

Saturday 29 March 2014

బాబుకు నిలువెల్లా విషమే

15:05 - By Unknown 0


బాబుకు నిలువెల్లా విషమే
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిలువెల్లా విషమున్న వ్యక్తి అని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. ఇప్పుడు కుక్కిన పేను మాదిరిగా ఉన్నా... తర్వాత పరిస్థితులు మారితే పాములా కాటు వేస్తాడని విమర్శించారు. తెలంగాణ పై ఆయన ప్రస్తుతం చూపే వైఖరిపట్ల జాగ్రత్తగా ఉండాని ప్రజలకు పిలుపునిచ్చారు. నల్లగొండ, వరంగల్‌కు చెందిన పలువురు కేసీఆర్ సమక్షంలో శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగిస్తూ... టీడీపీ ముమ్మాటికీ ఆంధ్రాపార్టీయేనని, తెలంగాణ ప్రజలు దానికి మద్దతు ఇవ్వకూడదని చెప్పారు. ఇప్పుడు కుక్కిన పేనులా ఉన్న చంద్రబాబు పరిస్థితులు మారితే పాములా కాటేస్తాడని హెచ్చరించారు. అందుకే ఆయన మాయమాటలపట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
 
 
తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానంటున్న చంద్రబాబు మూడు అంశాలపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. పోలవరం డిజైన్‌ను మార్చడానికి సిద్ధమేనా? దుమ్ముగూడెం ప్రాజెక్టు రద్దు చేయడానికి అంగీకరిస్తావా? ఉద్యోగుల విభజనలో ఎక్కడి ప్రాంతవాసులు అక్కడే వంటి విషయాలపై స్పష్టత ఇవ్వాలన్నారు.
 
 తెలంగాణ పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధించాలంటే టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలని కేసీఆర్ మరోమారు ప్రకటించారు. కొత్త నాయకత్వంలో సరికొత్త పంథాలో అభివృద్ధి జరగాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను ఇప్పటికే చూశామని చెప్పారు. అవి సరిగ్గా పనిచేస్తే రైతుల ఆకలి చావులు ఎందుకు ఉంటాయి? గ ల్ఫ్ దేశాలకు వలసలెందుకు వెళతారు? అని ప్రశ్నించారు. తె లంగాణ సంపూర్ణ అభివృద్ధి కోసం సమగ్రవంతంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని... పేదలకు ఇళ్లు, లక్ష లోపు రైతు రుణాల రద్దు వంటి పలు విషయాలను ఇందులో పొందుపరుస్తున్నామని తెలిపారు. తెలుగువారి సంవత్సరాది ఉగాది రోజున పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్‌లో టెక్స్‌టైల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పొన్నాలపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులకు అనుమతిని జారీ చేశారని విమర్శించారు. కార్యక్రమంలో కొండా దంపతులు తదితరులు పాల్గొన్నారు.
 ఏప్రిల్ 1న బాబుమోహన్ చేరిక: నటుడు బాబుమోహన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త బీబీ పాఠిల్ ఏప్రిల్ ఒకటో తేదీన టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో వీరు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు సమాచారం. బాబుమోహన్ శనివారం  కేసీఆర్‌ను కలసి పార్టీలో చేరే విషయంపై చర్చించారు.

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top