Contact

Text

Tuesday 8 April 2014

'గర్జన పేరుతో చంద్రబాబు మొరుగుతున్నారు'

21:09 - By Unknown 0

NewsListandDetails
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడపై వైఎస్సార్ సీపీ మండిపడింది. ఎన్నికల ముందు ప్రజా గర్జన పేరుతో ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి.. చంద్రబాబుకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు గర్జనల పేరుతో మొరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
 
ఆయనకు ఏమైనా దైర్యం ఉంటే నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దపడాలన్నారు. నరేంద్ర మోడీ, పవన్ కల్యాణ్, జేపీ ఎల్లో మీడియా మాస్క్ లతో బాబు మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు కొట్టుమిట్టాడుతున్నారని దుయ్యబట్టారు.

Tags:
About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top