కాంగ్రెస్ నాయకులు అందరూ పోలోమని టిడిపిలోకి రావడంతో ఇక తెలుగుదేశంకు సీమాంధ్రలో అధికారం ఖాయం అనుకున్నారు…ఆ పార్టీ శ్రేణులు. కాని ఎన్డిటివి, నిల్సన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టిడిపికి ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో ఆపార్టీ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆపార్టీకి 50లోపు అసెంబ్లీ సీట్లు సీమాంధ్రలో దక్కుతాయని చెప్పడం…40శాతం ఓటర్లు అనుకూలంగా ఉన్నారని చెప్పడంతో నేతలతో పాటు ఆపార్టీ అధినేతకు కూడా నిద్ర పట్టే పరిస్థితి లేదు. సిఎం రమేష్ వంటి పారిశ్రామిక వేత్తలు ఎంతగా బుకాయించినా కాని ఈ సర్వే ఫలితాలు అటు ఇటూ కావచ్చు కాని..పూర్తిగా తెలుగుదేశంకు అనుకూల ఫలితాలు వస్తాయని అనుకోలేం…దీనితో టిడిపి పరిస్థితి కాంగ్రెస్ నేతలు చేరడంతోనే దిగజారిందని అనుకుంటున్నారు. కాగా వైసిపికి సీమాంధ్రలో ఫలితాలు అనుకూలంగా రావడంతో ఆపార్టీ మాంచి జోష్ మీద ఉంది. వైసిపికి గ్రామీణ ప్రాంత ఓటర్లు సానుకూలంగా ఉన్నారని చెప్పింది. ఆ పార్టీకి 140లోపు సీట్లు వస్తాయని అధికారానికి పూర్తి మెజారిటీ సాధిస్తుందని చెప్పారు. సీమాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేవలం 88సీట్లు మాత్రమే ఉంటే చాలు. దీనితో అధికారం చేపట్టడానికి సంపూర్ణ మెజారిటీ వస్తుందని నిల్సన్ సర్వే తేల్చి చెప్పింది. దీనితో టిడిపి తెలంగాణ, సీమాంధ్రలో మరో ఐదేళ్లు ప్రతిపక్ష పాత్రకు సిద్ధంకాక తప్పదు
0 comments:
Post a Comment