* టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
* పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారు
* రాష్ట్ర విభజనకు చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు సింగపూర్లా చేస్తానంటున్నారు
* ఒక మనిషిని పొడిచేసి.. అతడి ఫొటోకూ తానే దండ వేస్తానన్నట్టుంది బాబు వైఖరి
* మూడున్నర కోట్ల ఉద్యోగాలు, రైతురుణాల మాఫీ అంటూ బాబు ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు
* సీఎం కాగానే ఐదు సంతకాలతో రాష్ట్ర చరిత్రనే మారుస్తా
సాక్షి, టెక్కలి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటూ మళ్లీ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తానని, రైతు రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు అబద్ధాల హామీలిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ఒక మనిషిని పొడిచేసి.. తర్వాత ఆ మనిషి ఫొటోకు తానే దండవేస్తానంటూ పరుగెత్తుకుంటూ వెళ్లాడట ఒకడు. అలా ఉన్నాయి చంద్రబాబు మాటలు. ఆయనకు ఇదేమీ కొత్తకాదు.
పిల్లనిచ్చిన సొంత మామ ఎన్.టి.రామారావునే వెన్నుపోటు పొడిచి, అధికారం లాక్కుని, ఇవాళ్టికీకూడా ఎన్నికలొచ్చిన ప్రతిసారీ అదే ఎన్టీఆర్ ఫొటో పెట్టి ఓట్లు అడుగుతాడు చంద్రబాబు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఆయన.. ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడవడని గ్యారంటీ లేదు’’ అని నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన జగన్మోహన్రెడ్డి టెక్కలిలో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభలో మాట్లాడారు. ఇదే వేదికపై పార్టీ టెక్కలి నియోజకవర్గ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ను, శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా రెడ్డి శాంతిని ప్రకటించారు. ఈ సభలో జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
ఇంతకంటే దారుణం ఉండదు బాబూ..
చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలని మాయమాటలు చెబుతున్నారు. రైతుల రుణాలు రూ.1.27 లక్షల కోట్లు మాఫీ చేస్తామంటున్నారు. డ్వాక్రా రుణాలు రూ.20 వేల కోట్లు మాఫీ చేస్తామని చెబుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ ఆదాయమే రూ.1.25 లక్షల కోట్లు. మరి రూ.1.47 లక్షల కోట్లు ఎలా మాఫీ చేస్తారో తెలియాలి. ఇంటికో ఉద్యోగమంటున్నారు. స్వాతంత్య్రం తర్వాత మన రాష్ట్రంలో ఇవాళ ఉద్యోగులు 20 లక్షల మంది మాత్రమే. నా వద్దకు కూడా చాలా మంది వచ్చి ‘రైతు రుణాలు మాఫీ చేస్తాం. ఇంటింటికీ రెండు ఉద్యోగాలిస్తామని చెప్పన్నా.. ఎన్నికల తర్వాత ఎవరు చూస్తారని’ అన్నారు. కానీ నేన లా చేయలేను. ఎందుకంటే చంద్రబాబుకు లేనిది.. నాకు దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ద్వారా వచ్చిందీ.. విశ్వసనీయతే. అదే విశ్వసనీయతతో నేనో మాట చెప్పాలనుకుంటున్నా.. చంద్రబాబు వయసు 65 సంవత్సరాలు. ఆయనకు తెలుసు.. ఈ ఎన్నికల తర్వాత తానుండడని, తన తెలుగుదేశం పార్టీ ఉండదని. అందుకే నోటికొచ్చిన హామీ ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు కంటే నేను పాతికేళ్లు చిన్నవాణ్ని. మరో 30 ఏళ్లు విశ్వసనీయ రాజకీయాలు చేయాల్సినవాడిని. అందుకే చెప్తున్నా.. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపైన.. అదే ఘడియలో రాష్ట్ర చరిత్రను మార్చే ఐదు సంతకాలు, మరో ఐదు కార్యక్రమాలు చేయబోతున్నా.
* పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచారు
* రాష్ట్ర విభజనకు చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు సింగపూర్లా చేస్తానంటున్నారు
* ఒక మనిషిని పొడిచేసి.. అతడి ఫొటోకూ తానే దండ వేస్తానన్నట్టుంది బాబు వైఖరి
* మూడున్నర కోట్ల ఉద్యోగాలు, రైతురుణాల మాఫీ అంటూ బాబు ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు
* సీఎం కాగానే ఐదు సంతకాలతో రాష్ట్ర చరిత్రనే మారుస్తా
సాక్షి, టెక్కలి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటూ మళ్లీ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తానని, రైతు రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు అబద్ధాల హామీలిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ఒక మనిషిని పొడిచేసి.. తర్వాత ఆ మనిషి ఫొటోకు తానే దండవేస్తానంటూ పరుగెత్తుకుంటూ వెళ్లాడట ఒకడు. అలా ఉన్నాయి చంద్రబాబు మాటలు. ఆయనకు ఇదేమీ కొత్తకాదు.
పిల్లనిచ్చిన సొంత మామ ఎన్.టి.రామారావునే వెన్నుపోటు పొడిచి, అధికారం లాక్కుని, ఇవాళ్టికీకూడా ఎన్నికలొచ్చిన ప్రతిసారీ అదే ఎన్టీఆర్ ఫొటో పెట్టి ఓట్లు అడుగుతాడు చంద్రబాబు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఆయన.. ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడవడని గ్యారంటీ లేదు’’ అని నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన జగన్మోహన్రెడ్డి టెక్కలిలో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభలో మాట్లాడారు. ఇదే వేదికపై పార్టీ టెక్కలి నియోజకవర్గ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ను, శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా రెడ్డి శాంతిని ప్రకటించారు. ఈ సభలో జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
ఇంతకంటే దారుణం ఉండదు బాబూ..
చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలని మాయమాటలు చెబుతున్నారు. రైతుల రుణాలు రూ.1.27 లక్షల కోట్లు మాఫీ చేస్తామంటున్నారు. డ్వాక్రా రుణాలు రూ.20 వేల కోట్లు మాఫీ చేస్తామని చెబుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ ఆదాయమే రూ.1.25 లక్షల కోట్లు. మరి రూ.1.47 లక్షల కోట్లు ఎలా మాఫీ చేస్తారో తెలియాలి. ఇంటికో ఉద్యోగమంటున్నారు. స్వాతంత్య్రం తర్వాత మన రాష్ట్రంలో ఇవాళ ఉద్యోగులు 20 లక్షల మంది మాత్రమే. నా వద్దకు కూడా చాలా మంది వచ్చి ‘రైతు రుణాలు మాఫీ చేస్తాం. ఇంటింటికీ రెండు ఉద్యోగాలిస్తామని చెప్పన్నా.. ఎన్నికల తర్వాత ఎవరు చూస్తారని’ అన్నారు. కానీ నేన లా చేయలేను. ఎందుకంటే చంద్రబాబుకు లేనిది.. నాకు దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ద్వారా వచ్చిందీ.. విశ్వసనీయతే. అదే విశ్వసనీయతతో నేనో మాట చెప్పాలనుకుంటున్నా.. చంద్రబాబు వయసు 65 సంవత్సరాలు. ఆయనకు తెలుసు.. ఈ ఎన్నికల తర్వాత తానుండడని, తన తెలుగుదేశం పార్టీ ఉండదని. అందుకే నోటికొచ్చిన హామీ ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు కంటే నేను పాతికేళ్లు చిన్నవాణ్ని. మరో 30 ఏళ్లు విశ్వసనీయ రాజకీయాలు చేయాల్సినవాడిని. అందుకే చెప్తున్నా.. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపైన.. అదే ఘడియలో రాష్ట్ర చరిత్రను మార్చే ఐదు సంతకాలు, మరో ఐదు కార్యక్రమాలు చేయబోతున్నా.
0 comments:
Post a Comment