Contact

Text

Sunday 18 May 2014

అక్బరుద్దీన్ హత్యకు కుట్ర

22:44 - By Unknown 0


హిందూపురంలో యాదృచ్ఛికంగా బట్టబయలు అంతర్రాష్ట్ర నేరగాడి అరెస్టు
భూ వివాదమా? రాజకీయ కోణమా?
హైదరాబాద్ సిటీ/హిందూపురం/బెంగళూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): ఒకసారి మృత్యువు నుంచి తప్పించుకున్న ఎంఐఎం నేత, ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బరుద్దీన్ ఒవైసీ హత్యకు కుట్ర జరిగింది! అక్బర్ హత్యకు సుపారీ తీసుకున్న వ్యక్తి హిందూపురంలో బైక్‌పై వెళ్తుండగా యాక్సిడెంట్‌కు గురవడంతో ఈ విషయం యాదృచ్ఛికంగా బయటపడింది. పోలీసులు అతణ్ని పట్టుకుని ప్రశ్నించగా గ్యాంగ్‌లోని మరో ముగ్గురు దొరికిపోయారు.
ఏం జరిగిందంటే..
ఆరేళ్లుగా వివిధ ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతున్న కుణిగల్ గిరి అనే అంతర్రాష్ట్ర నేరగాడి బృందం పదిహేను రోజులుగా హిందూపురంలో మకాం వేసింది. శనివారం రాత్రి గిరి తన ప్రియురాలి ఇంటి నుంచి వెళ్తుండగా బండి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడున్నవారు చికిత్స నిమిత్తం అతణ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అతడి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేశారు. అయితే, గిరి మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో అతడి దుస్తులు, వస్తువులు సోదా చేశారు. అతడి వద్ద ఒక పిస్టల్, రెండు లైవ్ రౌండ్ల బుల్లెట్లు, ఒక నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ బయటపడటంతో అప్రమత్తమయ్యారు. వాటిని స్వాధీనం చేసుకుని అతణ్ని విచారించగా మొత్తం విషయాలూ పూసగుచ్చినట్టు చెప్పాడు. తన పేరు గిరీష్ అలియాస్ కుణిగల్ గిరి అలియాస్ మోదూరి గిరి అని.. తనది కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా హోసూరు గ్రామమని తెలిపారు. అతడిచ్చిన సమాచారం మేరకు అతడి గ్యాంగ్‌కు చెందిన గోవిందు, వాసు, మంజులను అరెస్టు చేశారు. వారంతా కర్ణాటకలో అనేక దొంగతనాలు చేశారని, వారిపై 80కి పైగా కేసులున్నాయని తేలింది. దీంతో హిందూపురం పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిని మినహా మిగతా ముగ్గురినీ అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు. కాగా.. గిరి బృందం హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం నేతల్లో ఒకరిని హతమార్చేందుకు సుపారీ తీసుకున్నట్టు తెలిసిందని బెంగళూరు పోలీసులు తెలిపారు. వారు పేరు వెల్లడించనప్పటికీ గిరి పేర్కొన్న ఎంఐఎం నేత అక్బరుద్దీనే అనే కథనాలు వినిపిస్తున్నాయి. గిరి గ్యాంగ్‌కు సుపారీ ఎవరు ఇచ్చారో ఇంకా తెలియలేదు. దీనివెనుక అసలు కారణాలు ఏమిటన్నది తేలనప్పటికీ రెండు వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. నాంపల్లిలోని ఓ భూవివాదమే దీనికి ప్రధాన కారణమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2011, ఏప్రిల్ 30న బార్కస్‌లో మహ్మద్ పహిల్వాన్ గ్యాంగ్ అక్బరుద్దీన్‌పై పట్టపగలు నడిరోడ్డుపై కాల్పులు జరిపిన సంఘటనలో ఆయన మృత్యువు నుంచి తప్పించుకున్నారు. బండ్లగూడలోని భూవివాదమే దీనికి కారణమని తేలింది. తాజాగా గిరి గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చింది రాజకీయ ప్రత్యర్థులేనని ఎంఐఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అక్బరుద్దీన్ నేరుగా కాబోయే ప్రధాని నరేంద్రమోదీపైనే ఆరోపణల బాణం ఎక్కుపెట్టారు.

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top