Contact

Text

Thursday 15 May 2014

జిల్లాల వారీగా వైకాపా MLA అంచనాలు

09:18 - By Unknown 0

వైకాపాకు వంద సీట్లు రావడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను తమ పార్టీకి 95కు తగ్గకుండా సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ఇందుకోసం వారు భారీ బెట్టింగ్‌లకు కూడా సిద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలు పార్టీకి వ్యతిరేకంగా వచ్చినా, వాటికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు చాలా తేడా ఉందని వారంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు తేదేపా అధినేత నారా చంద్రబాబునాయుడుకు, వైకాపా అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి మధ్య జరిగాయని అందువల్ల ఈ ఎన్నికల్లోనే జగన్‌ సత్తా ఏమిటో, చంద్రబాబు సత్తా ఏమిటో తెలుస్తుందని అంటున్నారు.

 

ఈ ఎన్నికల ఫలితాలే జగన్‌, చంద్రబాబు సత్తాకు అసలైన పరీక్ష అని ఆ ఎన్నికల్లో విజయం సాధించిన వారే నిజమైన సత్తా ఉన్న నేతలని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జగన్‌ గత నాలుగు సంవత్సరాలుగా ప్రజల మధ్యే ఉన్నారని, అనుక్షణం వారి కోసం పరితపించారని, ఆయన్ను తప్పకుండా ఎన్నికల్లో గెలిపిస్తారని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. స్థానిక ఎన్నికలు అనుకోకుండా వచ్చాయని వాటిపై తాము అంతగా దృష్టి సారించలేదని వారు చెపుతున్నారు.

 

మొత్తంగా చేస్తే కనీసం 88 నుంచి 90 కు తగ్గకుండానైనా తమకు ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఎంపీ స్థానాల్లో కనిష్టంగా 12, గరిష్టంగా 18కు తగ్గకుండా తమకు వస్తాయని వారు చెపుతున్నారు. కోస్తాంధ్రలోని శ్రీకాకుళం నుంచి ఉభయగోదావరి జిల్లాల వరకు తాము కొంచెం వెనకపడినా అసెంబ్లీ ఎన్నికల నాటికి పుంజుకున్నామని చెపుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మునిసిపిల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ పూర్తిగా వెనుకపడిపోయింది. అయితే సాధారణ ఎన్నికల్లో జిల్లాలో బలంగా ఉండే కాపు సామాజికవర్గానికి 6 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు కేటాయించారు. దీంతో వారంతా వైకాపాకు వెన్నుదన్నుగా నిలిచారని, ఇప్పుడు అక్కడ తాము మంచి ఫలితాలు సాధిస్తామని చెపుతున్నారు. పురపాలక, స్థానిక ఎన్నికలు ఈ పరిణామాలకు ముందు జరిగినందున వాటి ఫలితాలు ఈ ఎన్నికలకు వర్తించవని వారు చెపుతున్నారు.

 

ఇలాగే విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోను ఆయా సామాజికవర్గాల వారీగా వైకాపా తేదేపా కంటే ఎక్కువగా అన్ని సామాజికవర్గాలకు సమంగా టిక్కెట్లు ఇచ్చిందని అందువల్ల ఇవన్నీ తమకు లాభిస్తాయని వారు చెపుతున్నారు.  ఇక జిల్లాల వారీగా కూడా తమ గెలుపుపై వారు లెక్కలు వేసుకుంటున్నారు. రాయలసీమలో అనంతపురం మినహా చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాలో 30 స్థానాలను కలపుకుని మొత్తం 35 స్థానాలు సాధిస్తామని వారు చెపుతున్నారు.

 

అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిషత్‌లు కైవసం చేసుకున్న తాము అసెంబ్లీ ఎన్నికల్లోను క్లీన్‌స్వీప్‌ చేస్తామని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సమానస్థాయిలో సీట్లు సాధిస్తామని, ఉత్తరాంధ్రలోను పై చేయి సాధిస్తామంటున్నారు. విజయలక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేయడంతో ఉత్తరాంధ్రలో పార్టీ బాగా బలపడిందని ఇక్కడ తేదేపాకంటే ఎక్కువ సీట్లు సాధించడం లేదా ఆ పార్టీతో సమాన స్థాయిలో సీట్లు సాధిస్తామని తద్వారా తాము ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు సాధిస్తామని చెపుతున్నారు.

 

జిల్లాల వారీగా వైకాపా అంచనాలు వేసుకుంటున్న స్థానాలు(కనిష్టం-గరిష్టం)
కడప: 8-9
కర్నూలు: 8-10
అనంతపురం: 4-6
చిత్తూరు: 7-9
నెల్లూరు: 8
ప్రకాశం: 8
గుంటూరు: 7-9
కృష్ణా: 6-8
పశ్చిమగోదావరి: 6-8
తూర్పుగోదావరి: 8-9
విశాఖపట్నం: 8-9
విజయనగరం: 5-6
శ్రీకాకుళం: 5-6

 



వైకాపా నాయకులు వేసుకుంటున్న లెక్కల ప్రకారం కనిష్టంగా 88, గరిష్టంగా 105 వరకు వస్తున్నాయి. ఇలా ఎలా చూసినా విజయం తమదేనని, తమ నాయకుడు జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top