Contact

Text

Friday 23 May 2014

కేసీఆర్... ప్రేలాపనలు మానుకో!

15:37 - By Unknown 0

చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు
వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు
ఉద్యోగులకు అండగా ఉంటాం: చంద్రబాబు



హైదరాబాద్, మే 23: 'కేసీఆర్ అసందర్భ ప్రేలాపనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చెప్పుడు మాటలు విని తప్పుడు మాటలు మాట్లాడటం రాష్ట్రానికి సీఎం అయ్యే వ్యక్తికి తగదు' అని టీడీపీ అధినేత, సీమాంధ్ర కాబోయే సీఎం చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల విభజన విషయమై తెలంగాణకు కాబోయే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీమాంధ్ర ఉద్యోగులను సచివాలయం గేటు దాటనివ్వం.. కాలు దువ్వితే కొట్లాటకైనా రెడీ వంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఉద్యమాన్ని భావోద్వేగాలతో ముడిపెట్టి సీట్లు, ఓట్లు సంపాదించుకున్నది చాలక అన్నదమ్ముల మధ్య కీచులాటలు, శాశ్వత వైరుధ్యం సృష్టించే విధంగా కేసీఆర్ వ్యవహరించడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఉద్యోగుల విభజన జరుగుతున్నప్పుడు సమగ్ర సమాచారం లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి శాంతిభద్రతల సమస్య తలెత్తేలా మాట్లాడటం సరైనది కాదన్నారు. ఉద్యోగులందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు.
కాగా, శుక్రవారం ఉదయం సీఎస్ పీకే మహంతి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం చంద్రబాబు నాయుడిని కలిసింది. రాష్ట్ర విభజనను దృష్టిలో పెట్టుకొని ఇరు రాష్ట్రాలకు చేసిన ఉద్యోగుల కేటాయింపులన్నీ పూర్తిగా తాత్కాలికమేనని వివరించింది. విభజనకు సంబంధించి జరుగుతున్న కసరత్తు, ఆర్థికఅంశాలను ఈ సందర్భంగా వారు వివరించారు. 'రెండు ప్రభుత్వాలు ఏర్పాటై పూర్తి స్థాయిలో పనిచేసేంత వరకూ తాత్కాలిక ఏర్పాటుగా మాత్రమే ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపులు జరిపాం. ఇరు ప్రభుత్వాలు తర్వాత ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఈ కేటాయింపులు మార్చుకోవచ్చు. ఉదాహరణకు న్యాయ శాఖలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు మరీ తక్కువ ఉన్నారు. పని నడవడం కోసం అక్కడ సీమాంధ్ర ప్రాంతం వారిని తెలంగాణకు తాత్కాలికంగా కేటాయించాం. మరో శాఖలో సీమాంధ్ర ప్రాంతం వారు చాలినంత మంది లేకపోతే తెలంగాణవారిని వేశాం. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా తెలంగాణ ప్రాంత వాసి ఉన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఆంధ్ర ప్రాంత వాసి ఉన్నారు. త్వరలో ఏర్పడనున్న ప్రభుత్వాలు వారిని మార్చుకోవచ్చు. ఇది కూడా ఉద్యోగ సంఘాలకు ముందుగా చెప్పే చేశాం. మేం రహస్యంగా చేసిందేమీ లేదు' అని ఒక అధికారి బాబుకు చెప్పారు.
ఉద్యోగుల స్థానికత నిర్ణయించే ముందు అన్నీ చూసుకొనే చేశామని, ఇది తెలిసి కూడా కొందరు నాయకులు కావాలని బురద చల్లుతున్నారని మరో అధికారి చెప్పారు. 'రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 11 లక్షల మంది ఉద్యోగుల వివరాలు అన్నీ పూర్తి స్థాయిలో కంఫ్యూటర్లలో ఉన్నాయి. వాటిని ఎవరూ మార్చలేరు. ఉద్యోగుల సర్వీస్ రిజిష్టర్లపై గతంలో గిర్‌గ్లానీ కమిషన్ పరిశీలన జరిపి ఎవరు ఏ ప్రాంతమో స్టాంపు కూడా వేసింది. ఆ వివరాలన్నీ కంప్యూటర్లలో ఎక్కించాం. దాని ప్రకారమే మేం నిర్ణయాలు తీసుకొంటున్నాం' అని ఆయన చెప్పారు. ఏ వివరాలైనా పారదర్శకంగా అందరికీ అందించి బహిరంగంగా చేయాలని, వివాదాలు వద్దని బాబు వారికి సూచించారు. 'ఎవరో ఏదో కమిటీలు వేసి పరిశీలన జరిపి వివరాలు బయట పెడతామంటున్నారు. వారికి ఎవరికో ఆ అవకాశం ఇవ్వడం ఎందుకు? మీ వద్ద ఉన్న వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టండి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు చేయండి. వివాదాలకు తావివ్వవద్దు' అని బాబు అధికారులకు స్పష్టం చేశారు.

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top