సొట్ట బుగ్గల బాలీవుడ్ సుందరి ప్రీతి జింటా ఐ పి ఎల్ లో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ ఓనర్ అనే విషయం తెలిసిందే. ఐ పి ఎల్ క్రికెట్ పోటీ లు జరుగుతుండటం తో ఓనర్ అయిన ప్రీతి జింటా సదరు మ్యాచ్ లకు హాజరై ఆటగాళ్ళలో జోష్ ని నింపడానికి ప్రయత్నాలు చేస్తోంది ఐతే అక్కడే సమస్య వస్తోందట. ప్రీతి జింటా హీరోయిన్ కూడా కావడంతో ఆటని తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులు ప్రీతి జింటా ని కలవడానికి ,కరచాలనం చేయడానికి ముందుకు వస్తూ విపరీతమైన అభిమానం చూపిస్తుండటం తో ప్రీతి కి ఇబ్బందిగా ఉందట ఎందుకంటే ఉత్సాహం ఎక్కువై ప్రీతి శరీరంపై ఎక్కడెక్కడో చేతులు వేసి తాకుతున్నారట!ఇది ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాళ్ళంతా నా అభిమానులే కానీ ఉత్సాహం మరీ ఎక్కువై ఇలా చేస్తున్నారని వాపోతుంది ప్రీతి జింటా. ఈ విషయాన్నీ ట్విట్టర్ లో పేర్కొన్నది.
0 comments:
Post a Comment