Contact

Text

Monday 19 May 2014

‘ఎవడు’ సినిమా పై శృతిహాసన్ ఫిర్యాదు

23:51 - By Unknown 0


హైదరాబాద్: ‘ఎవడు’ సినిమాలోని స్టిల్స్‌ను తన అనుమతి లేకుండా సినీ వెబ్‌సైట్లలో పెట్టారంటూ హీరోయిన్ శృతిహాసన్ ఇటీవల సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పలువురు వెబ్‌సైట్ ఫొటోగ్రాఫర్లను సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. గత మూడు రోజులుగా సినీ వెబ్‌సైట్ ఫొటోగ్రాఫర్లను పిలిపించి.. ఆ ఫొటోలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు? ఎందుకు వెబ్‌సైట్లలో పెట్టారనే  విషయాలపై విచారిస్తున్నారు.

ఎవడు సినిమాలో తనపై తీసిన ఫొటోలను వెబ్‌సైట్లలో పెట్టడం లేదని ఆ సినిమా నిర్మాత చెప్పారని, తీరా చూస్తే ఇటీవల 11 స్టిల్స్ వెబ్‌సైట్లలో దర్శనమిచ్చాయని ఆమె ఆరోపించారు. ఒప్పందానికి విరుద్ధంగా ఈ ఫొటోలు వెబ్‌సైట్‌లో పెట్టారని ఆమె పేర్కొన్నారు.  తన అనుమతి లేకుండా ఇలా ఫొటోలను వాడుకోవడం సబబు కాదని, ఈ పని చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 10 మంది ఫొటోగ్రాఫర్లను పోలీసులు విచారించారు. స్టిల్స్ పెట్టడంలో దురుద్దేశాన్ని  అడిగి తెలుసుకున్నారు.

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top