Contact

Text

Monday 19 May 2014

ఎన్డీయే సమావేశానికి పవన్‌కల్యాణ్‌కు ఆహ్వానం

08:32 - By Unknown 0


ఢిల్లీ: రేపు జరగబోయే ఎన్డీయే సమావేశానికి జనసేన వ్యవస్థాపకుడు, సినీహీరో పవన్‌కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. ఎన్నికల్లో బీజేపీ, టిడిపి కూటమి తరపున పవన్  ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. పవన్ ప్రచారానికి బిజెపి ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గుజరాత్ వెళ్లి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే.

ఫలితాలు వెల్లడైన తరువాత ఎన్నికలలో ప్రచారం చేసినందుకు  పవన్ కల్యాణ్‌కు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ లు  కృతజ్ఞతలు కూడా తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ ఫోన్ లో  ఎన్ డిఏ సమావేశానికి రావలసిందిగా పవన్ ను కోరారు. జనసేన పార్టీ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ పార్టీ తరపున ఎంపిలు ఎవరూ లేరు. అయినా అతనిని  పార్లమెంటు బోర్డు సమావేశానికి కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని కోరినట్లు తెలిసింది. ఎన్ డిఏ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ ఈ సాయంత్రం ఢిల్లీ బయలుదేరుతున్నట్లు సమాచారం.

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top