Contact

Text

Wednesday 14 May 2014

పాతబస్తీలో శాంతి పరిడవిల్లాలి: వైఎస్ జగన్

10:39 - By Unknown 0

హైదరాబాద్: పాతబస్తీలో శాంతి పరిడవిల్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వదంతులు నమ్మొద్దని సూచించారు. శాంతి సామరస్యాలు కాపాడాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో విషయంలో  సంయమనంతో వ్యవహరించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

కిషన్ బాగ్ ప్రాంతంలోని సిక్ చావ్ నీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు పోలీసులు సహా ఏడుగురు గాయపడ్డారు. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. మృతులు ఇద్దరు పోలీసు కాల్పుల్లో మృతి చెందారా లేక అల్లర్లలో మృతి చెందారా అనేది పోస్టుమార్టంలో తేలుతుందని డీజీ(శాంతిభద్రతలు) వీఎస్ కే కౌముది అన్నారు. ప్రస్తుతం కిషన్ బాగ్ లో పరిస్థితి అదుపులోనే ఉందని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

About the Author

Follow me @Latest news
View all posts→

Get Updates

Subscribe to our e-mail newsletter to receive updates.

Share This Post

0 comments:

narrowsidebarads

Post your AD here 300x250 AD TOP

...

Blog Archive

© 2014 HOT NEWS. WP Theme-junkie converted by Bloggertheme9
Powered by Blogger.
back to top