సీఎన్ఎన్ ఐబీఎన్, ఇండియా టీవీ, టైమ్స్ నౌ లాంటి ఛానళ్లు కూడా ఎన్డీయే కూటమికి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మెజారిటీ లభిస్తుందనే చెబుతున్నాయి. లోక్ సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే కనీసం 272 స్థానాలు అవసరం అవుతాయి. ఆ సంఖ్యను బీజేపీ కూటమి సులభంగా సాధించగలదని సర్వేలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద ఎన్నికల కమిషన్ విధించిన సమయం కూడా అయిపోయింది. దాంతో ప్రతి ఛానల్.. తన సర్వే ఫలితాలను వెల్లడించడం మొదలుపెట్టింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ ఇప్పటికీ తన హవా నిలబెట్టుకుంటుందనే జాతీయ వార్తా ఛానళ్లు అంటున్నాయి.
| కూటమి | న్యూస్ ఎక్స్ | ఎన్డీటీవీ | జీ న్యూస్ | ఆజ్ తక్ | ఇండియా టీవీ | ఏబీపీ |
| ఎన్డీఏ | 289 | 283 | 299 | 298 | 315 | 278 |
| యూపీఏ | 101 | 99 | 112 | 93 | 80 | 93 |
| ఇతరులు | 153 | 169 | 132 | 152 | 148 | 172 |

About the Author

0 comments:
Post a Comment